500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారమవుతోందని ఆయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదిలావుంటే పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో చేరుకున్నారు. పవన్ కల్యాణ్ రేపు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, దేశ ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోందని తెలిపారు. 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటుండడం చాలా సంతోషం కలిగిస్తోందని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa