ఏపీకి షర్మిల రాక.. మరొక నాన్లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కులేదని మంత్రి రోజా అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్ను 16 నెలలు జైల్లో పెట్టించిందని ఆమె ధ్వజమెత్తారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వడమాల పేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్ను మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలో మహిళల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాల నిర్వహణ వడమాలపేటలో పింక్ బస్సు ద్వారా మహిళల కోసం ప్రత్యేక ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరంను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఉద్యోగాలు చేసుకునే మహిళలు, కూలి పనికి వెళ్లే వారు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోరని, అలాంటి మహిళల ఆరోగ్యం కోసం క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు చెప్పారు. వడమాలపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పింక్ బస్సు ద్వారా మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరంను మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆసుపత్రి డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ నేతృత్వంలో నలభై సంవత్సరాలు పైబడిన మహిళల్లో గర్భాశయ ముఖద్వారం, క్యాన్సర్ నిర్ధారణ కోసం ఉచిత స్విమ్స్ వైద్య శిబిరం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa