మంగళగిరిలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వచ్చే విధంగా పని చేయాలని పార్టీ నాయకులు,కార్యకర్తలకు వైజ్ఞస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నాయకులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.మొదటిగా నియోజకవర్గంలో ఈ నెల 31న పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర ను విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైనికులతో శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలానికి నాయకులు,కార్యకర్తలు ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa