ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస సెలవులతో ,,,,తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 06:59 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారిమెట్టు నడక మార్గంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజులు వరుస సెలవులు కావడంతో భక్తులు క్యూ కడుతున్నారు. ఉదయం 8గంటలకే 3వేల సర్వదర్శన టోకెన్లు జారీ పూర్తి కావడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. టీటీడీ గతంలో 6వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేసేంది.. టోకెన్లు జారీ కుదించడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు.


మరోవైపు తిరుమలలో క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం 71,664 మంది స్వామివారిని దర్శించుకోగా.. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. అలాగే టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటలు సమయం పడుతోందది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. వీకెండ్ కావడంతో పాటుగా మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ చెబుతోంది.


టీడీ పరిపాలనా భవనంలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు


తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో ‌సతీష్ కుమార్‌ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 39 మంది అధికారులు, 264 మంది ఉద్యోగులకు, స్విమ్స్‌లో ఇద్ద‌రికి, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు.


సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు సంఘ‌ట‌న మ‌హా య‌జ్ఞం అనే కీర్తనను సుమధురంగా అలపించారు. అనంతరం మా తెలుగు త‌ల్లికి,నాట్యమిదే గీతాల‌కు ప్ర‌ద‌ర్శించిన సంప్రదాయ నృత్యం ఆక‌ట్టుకుంది. టీటీడీ నిఘా, భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి శ్రీ ర‌మ‌ణ‌ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. లీలా, ఇందు, గంగా, టైగ‌ర్‌, హ‌ని అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్‌ డ్రిల్‌, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్‌ డ్రిల్‌, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి. అటు తిరుమలలో కూడా రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa