పవన్ కళ్యాణ్ను కలిసినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ఎంత అనుభూతి పొందుతామో.. అంతకుమించి అనుభూతిని పొందానన్నారు కమెడియన్ పృథ్వీరాజ్. భజన అనుకుంటే అనుకోండి కానీ.. పవన్ కళ్యాణ్ను చూసినా, వెంకన్నసామిని చూసినా ఒకటేనన్నారు. జనసేన కండువా కప్పుకున్నాక మొదటిసారి షూటింగ్లో పాల్గొనేందుకు అమలాపురం వచ్చానన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ప్రకృతిని దోచుకోవడంతో ప్రకృతి తిరగబడిందని.. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అనారోగ్యాల పాలవుతున్నారు.. కొంతమంది చనిపోతున్నారన్నారు. వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పేలు లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుని ఎలక్షన్ కోసం దాచి పెడుతున్నారన్నారు.
టీడీపీ జనసేన రెండు జండాల కలయికతో శాంతికి, సంక్షేమానికి, మహిళల భద్రతకు, రైతుల భరోసాకు, కులమతాలకు అతీతంగా ముందుకు పోవడం శుభ పరిణామం అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు వై నాట్175 అని మురిసిపోతున్నారని.. ఈసారి 175 పక్కన 5 తీసేస్తే 17 మిగులుతాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లతో పాటు అంబటి రాంబాబుని కూడా పిలవచ్చని.. ఒక లక్ష రూపాయలు రెమ్యునరేషన్ కూడా ఇవ్వొచ్చన్నారు. వీళ్ళ నోటి నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్కు మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోయారంటన్నారని.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోవడం వల్ల అమలాపురం రోడ్ల అభివృద్ధి ఆగిపోయిందా? అన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు ప్రకృతిని దోచుకోవడంతో ప్రకృతి తిరగబడిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్టులో జనసేన పార్టీ కార్యకర్తలకు మధ్యవేలు చూపించిన రోజాను.. జనసైనికులు అసలు వదిలిపెట్టరన్నారు. రాబోయే జనసేన, టీడీపీ కూటమి 136 అసెంబ్లీ స్థానాల్లోనూ, 21 ఎంపీ స్థానంలోని ఘన విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రెండురోజులు వస్తేనే మీకు తడిచిపోతుంది.. ఇక పర్మినెంట్గా వస్తే మీ సంగతేంటి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa