తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ బలంగా లేదని,వచ్చే ఎన్నికల్లో కూడా వరసగా మూడో సారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వైయస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు..మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు..తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు మంగళగిరిలో రెండు సార్లు మాత్రమే గెలిచిందని ఆయన గుర్తు చేశారు..ముఖ్యమంత్రి గారు బడుగు బలహిన వర్గాలు, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి అధిక ప్రధాన్యత ఇస్తున్నారని చెప్పారు..మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని,దానిలో భాగంగానే ఆ సామాజిక వర్గానికి సిటు కేటాయించారని తెలిపారు..మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవి కావాలో హైదరాబాదులో ఉండే టిడిపి అభ్యర్థి కావాలో మంగళగిరి ప్రజలు తెల్చుకోవాలని అన్నారు..స్దానికుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడని,హైదరాబాదులో ఉండి టూరిస్ట్ లాగా వచ్చే వ్యక్తి మీతో ఉండడని చెప్పారు.మీతోనే ఉండి మీతో కలిసి నడుస్తున్న వ్యక్తి... గంజి చిరంజీవిని ఎన్నుకోవాలని చెప్పారు.గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రెడ్డిని కాదని బిసి ఆయిన చిరంజీవికి జగన్ గారు సీటు కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. ఓడిపోతారనే బీసికి టికెట్ ఇచ్చారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ....ఓటమి భయం అనేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదని, రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో బిసి, ఎస్సీ ఎస్టీ,మైనారిటీలకు అధికశాతం సిట్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసి అని చెప్పారు..ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉందో వారికే పార్టీ సిట్లును కేటాయిస్తోందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa