పోలవరం: మే నెలకల్లా గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల అమరికను ప్రారంభించిన అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నానన్నారు. మోడీ పాలనలో రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని పేర్కొన్నారు. డబ్బులివ్వకుండా కేంద్రం సహాయ నిరాకరణ చేసిందన్నారు. తెలంగాణ కన్నా 50వేలు ఎక్కువగా రుణమాఫీ చేశామని అన్నారు. నదుల అనుసంధానం చేసిన తొలి ప్రభుత్వం మనదేనన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామని పేర్కొన్నారు. రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వడమే నా జీవితాశయమన్నారు. మేలోగా అన్ని గేట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఇప్పటి వరకు 63 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa