ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేశారు: దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 12:48 PM

ఏడు ముంపు మండలాలు తీసుకోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు కల సాకారమవుతోందని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సులో దేవినేని పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపడానికి సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రల పన్నినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. 2016 డిసెంబర్‌లో మొదటి పిల్లర్‌కు సీఎం శంకుస్థాపన చేశారని గుర్తు చేశారని, మళ్లిd ఇవాళ మొదటి గేటు బిగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగున్నరేళ్లలో రూ.10,290 కోట్లు ఖర్చు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa