భారత మార్కెట్లో వన్ప్లస్ బ్రాండ్కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం బడ్జెట్ను టార్గెట్ చేసుకొని ఫోన్లను విడుదల చేస్తూ వచ్చిన వన్ప్లస్ ఇటీవల బడ్జెట్ ధరలో ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది.మరీ ముఖ్యంగా రూ. 20 వేలలోపు స్మార్ట్ ఫోన్స్ను లాంచ్ చేస్తోంది. వన్ప్లస్ బ్రాండ్ నుంచి తక్కువ ధరకు ఫోన్లు అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా వన్ప్లస్ నుంచి మరో బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. వన్ప్లస్ నార్డ్ ఎన్30ఎస్ఈ పేరుతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ యూఏఈలో లాంచ్ అయ్యింది. వన్ప్లస్ నార్డ్ ఎస్ఈ 5జీ ఫోన్ యూఏఈలో విడుదల చేశారు. అయితే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాల ఇప్పుడు తెలుసుకుందాం..
వన్ప్లస్ నార్డ్3ఎస్ఈ 5జీ స్మార్ట్ ఫోన్లో 6.72 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను ఇచ్చారు. 2,400 x 1,080 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ విత్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో పనిచేస్తుంది. ఈ ఫోన్ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు 300 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్ను ఇందులో ప్రత్యేకంగా అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో డ్యూయర్ రియర్ కెమెరా సెటప్ను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్స్తో కూడిన డెప్త్ సెన్సార్ను అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్ సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ను యూఎస్బీ టైప్-సీ పోర్ట్తో తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ బరువు 193 గ్రాములుగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ను సాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ రంగుల్లో లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే యూఏఈ మార్కెట్లో ఈ ఫోన్ బేస్ వేరియంట్ను 599 ఏఈడీలుగా నిర్ణయించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 13,600గా ఉండనుంది. అయితే భారత్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర కాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్ప్లస్ బ్రాండ్ నుంచి రూ. 15వేల లోపు 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం విశేషమనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa