‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తూ.. అండంగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి గుంటూరు, నరసారావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. నాలుగు రోజుల పాటు పర్యటన సాగనుంది. భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను టీడీపీ ఖరారు చేసింది. రేపటి నుంచి ఈనెల 9 వరకు భువనేశ్వరి పర్యటన సాగనుంది.
6న మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన.
7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన.
8న తాడికొండ నియోజకవర్గంలో పర్యటన.
9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa