జగన్ ప్రభుత్వ మాయలపై గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము ధ్వజమెత్తారు. మంగళవారం జగన్నాధపురంలో నియోజకవర్గ బీసీ సాధికార కమిటీ, రజక సంఘీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ సోదరులు తెలుగుదేశానికి గుండెతో సమానమని అన్నారు. నా బీసీలంటూ సీఎం జగన్ చెబుతున్న కల్లబొల్లి కబుర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. సొంత తల్లిని, చెల్లిని గాలికి వదిలేసిన జగన్ రెడ్డి.. మహిళలందరూ అక్క చెల్లెమ్మలంటూ షో చేస్తున్నారని విమర్శించారు. పురాణాల్లో కూడా జగన్ రెడ్డి లాంటి పాలకుడు లేరన్నారు.పథకాల పేరుతో మన డబ్బు మనకే ఇస్తూ, ఏదో బిక్షం వేస్తున్నట్లు సీఎం జగన్ బిల్డప్ ఇస్తున్నారని వెనిగండ్ల రాము విమర్శించారు. వాలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతూ జగన్ రెడ్డి సభలకు ప్రజలను తరలిస్తున్నారని ఆరోపించారు. లిటికేషన్లతో కూడిన జగన్ పథకాల వల్ల ప్రజలకు ఒరిగేది శూన్యమన్నారు. ఎటువంటి షరతులు లేకుండా పేద వర్గాల ప్రయోజనానికి చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని, టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బీసీ సోదరులకు పూర్వ వైభవం వస్తుందని వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa