ఏపీలో బడ్డెట్ సమావేశాలు మంగళవారం హాట్ హాట్గా సాగాయి. సోమవారం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మంగళవారం టీడీపీ సభ్యుల ఆందోళనతో సభకు అంతరాయం కలగ్గా.. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటుగా వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ డిమాండ్ చేయగా.. స్పీకర్ అంగీకరించలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి, ఈలలు వేస్తూ సభలో నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు.
అయితే టీడీపీ సభ్యులు ఆందోళన చేసిన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే చర్చలో భాగంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టూచేరి నిరసనలు చేపట్టారు. దీంతో అబ్బయ్య చౌదరి ప్రసంగానికి అంతరాయం కలగ్గా.. టీడీపీ సభ్యులపై ఆయన ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులకు ఎప్పుడూ కుర్చీ మీదే ధ్యాసని అందుకే స్పీకర్ కుర్చీ చుట్టూ చేరుతున్నారంటూ ఆవేశంగా మాట్లాడారు. ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తొడలు కొడితే కుర్చీలు రావడానికి ఇదేం సినిమా కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రజా నమ్మకం, విశ్వాసం పొందితేనే కుర్చీ వస్తుందని అభిప్రాయపడ్డారు.మరోవైపు సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్లను స్పీకర్ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa