ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏం కడిగావ్ తంబీ.. నీళ్లు నమిలిన మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 06:30 PM

తన ప్రసంగాలతో ఇన్నాళ్లూ మంత్ర ముగ్థులను చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురు దెబ్బ తగిలింది. మీకు పన్ను వసూళ్లపై ఉన్న యావ తప్ప మధ్య తరగతి ప్రజల పై లేదంటూ ఒక కార్యకర్త వేసిన ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీ నీళ్లు నమిలారు. ఊహించిన ప్రశ్న కార్యకర్త నుంచే రావడంతో వెంటనే మోదీ తేరుకుని తన ప్రభుత్వం సామాన్యుల కోసమే పనిచేస్తుందని చెప్పి సమాధానపర్చే ప్రయత్నం చేశారు పుదుచ్చేరికి చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ఇరకాటంలో పడ్డారు. నిర్మల్ కుమార్ జైన్ అనే కార్యకర్త లేచి, కేంద్ర ప్రభుత్వం పన్ను వసూళ్లపైనే దృష్టి సారిస్తోంది తప్ప మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదని అన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీ సమాధానం ఏమిటని అతను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అవాక్కయిన ప్రధాని వెంటనే తేరుకుని తన ప్రభుత్వం సామాన్య ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్న వేసింది వ్యాపారి అయిన నిర్మల్ కుమార్ జైన్ కాబట్టి అతని నుంచి ఇటువంటి ప్రశ్న రావడం సహజమేనని ప్రధాని అన్నారు. వెంటనే పురుచ్చేరి కో వణక్కం అంటూ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రధాని ముగించేశారు. కాగా, దేశవ్యాపంగా ఉన్న పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతో ఇకనుంచి మమేకం చెందేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమం మార్గదర్శక సూత్రాలను మార్చాలని బీజేపీ నిర్ణయించుకున్నది. ప్రధానితో మాట్లాడదలచని పార్టీ కార్యకర్త ఇకపై తన ప్రశ్నను వీడియోలో చిత్రీకరించి ప్రతి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు పంపించాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa