చంద్రబాబు ఢిల్లీ పెద్దల కోసం గేట్ల వద్ద కాపలా కాస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు.అయన మాట్లాడుతూ.... రాజమండ్రీ మోరంపూడి ఫ్లైఓవర్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైందన్నారు. మార్చికి ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బుచయ్య చౌదరికి ఫ్లై ఓవర్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేసే ఎత్తుగడలన్నీ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. ఢిల్లీ పెద్దల పర్మిషన్ కోసం గేట్ల వద్ద కాపలా కాస్తున్నారు. అమిత్ షా తిరుపతి దర్శనికి వస్తే ఆయన కాన్వాయ్పైకి చెప్పులు విసిరించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. సిద్ధం అనే స్లోగన్ మాది.. తెలుగుదేశం కూడా సిద్ధం అంటుంది వారికంటూ ఒక ఎజెండా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటునే మేము రాబట్టాల్సిన నిధులు రాబడుతున్నామని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మేము పెట్టబోయే మొదటి అంశం ప్రత్యేక హోదా , పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాబట్టడమే ధ్యేయంగా ప్రయత్నం చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa