విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.4 నాలుగు విలువైన కాపర్ బండిల్స్ చోరీకి గురయినట్టు గుర్తించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అక్కడ సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం సీఐఎస్ఎఫ్, హెచ్పీసీఎల్ అధికారులు ఫుటేజీను పరిశీలిస్తుండగా చోరీ వ్యవహారం బయటపడింది. దీనిపై సమగ్రంగా ఆరా తీసిన అధికారులు.. చివరు చోరీ జరిగినట్టు నిర్ధారించారు. అనంతరం అదేరోజు అర్ధరాత్రి మల్కాపురం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హెచ్పీసీఎల్ చరిత్రలో జరిగిన అతి భారీ చోరీ ఇదే కావడం గమనార్హం.
ఈ ఘటన వెనుక భద్రతా విధుల్లో ఉన్న ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్టు గుర్తించారు. చమురు శుద్ధి యూనిట్లలో ఉష్ణోగ్రతల నమోదు సమయంలో కాపర్ను వాడుతుంటారు. ఇటీవలే కాపర్ బండిల్స్ను తెప్పించి సంబంధిత యూనిట్లో బిగించారు. మిగిలిన కాపర్ను హెచ్పీసీఎల్ యాజమాన్యానికి అప్పగించాల్సి ఉంది. కానీ, కాంట్రాక్ట్ తీసుకున్న జయలక్ష్మి ఇంజనీరింగ్ సంస్థ యజమాని బంధువు ఒకరు జనవరి 28న ఓ వ్యాన్లో ఆ బండిల్స్ను తరలించాడు. సీసీ కెమెరాల ఫుటేజీలను శుక్రవారం పరిశీలిస్తుండగా కాపర్ బండిల్స్ను వ్యాన్లో బయటకు పంపేసిన దృశ్యాలు చూసి అధికారులు షాకయ్యారు.
అధికారులు దీనిపై ఆరా తీయగా.. లోపలికి నకిలీ పాస్ ద్వారా ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ఈ పాస్ తయారీకి, కాపర్ బండిల్స్ బయటకు పోవడానికి సంస్థకు చెందిన ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహకరించినట్టు వెల్లడయ్యింది. భారీ చోరీ కావడంతో ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హెచ్పీసీఎల్, సీఐఎస్ఎఫ్ అధికారులు రెండోసారి పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణను వేగవంతం చేయాలని పోలీసులను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa