జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం పవన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa