అభివృద్ధి ఎవరిదో? విధ్వంసం ఎవరిదో? తేల్చుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ బహిరంగ చర్చకు రావాలని శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్య క్షుడు కూన రవికుమార్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న జగన్రెడ్డి సంక్షేమం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా విధ్వంసం కనిపిస్తోందన్నారు. రాప్తాడు సభ విజయవంతం అయి ఉంటే జగన్రెడ్డి రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీ డియా సిబ్బందిపై దాడులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్పై పేదలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్రెడ్డి అసమర్థ పాలన వలన రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే 44శాతం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం తప్ప జగన్ సాధించింది ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బొనిగి భాస్కరరావు, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, రాష్ట్ర తెలుకల బీసీ సాధికార సమితి డైరెక్టర్ కొమ్మనాపల్లి వెంకటర ామరాజు, రాష్ట్ర జంగ మ సాదికార సమితి డైరెక్టర్ విభూది సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa