కృష్ణానదీ పరీవాహ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వెల్లడించింది. ఏపీ సర్కార్ పిటిషన్పై ఈరోజు సుప్రీంలో విచారణకు రాగా.. ఈ వ్యవహారంపై సుధీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని అందువల్ల వాయిదా వేసి మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరారు. దీనికి ఏపీ తరపు న్యాయవాది రఘుపతి అభ్యంతరం తెలిపారు. తాము ఇప్పుడు వాదనలు వినిపించేందుకు సిద్ధం అని న్యాయవాది అన్నారు. ఇరువురి వాదనల అనంతరం పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీం న్యాయస్థానం ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా స్పష్టం చేశారు. కాగా.. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, దీని వల్ల ప్రాజక్టుల్లో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 2021 ఏడాది తొలి అంకంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై కేంద్రానికి పిర్యాదు చేయడంతో పాటు... అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టును ఏపీ ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కేంద్రానికి, కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో సీఎండీలకు ఉన్నతన్యాస్థనం నోటీసులు జారీ చేసింది. ఈరోజు మరోసారి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa