జనసేన పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ బయలుదేరారు. మరికాసేపట్లో జనసేన, టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు నివాసానికి ఇవాళ ఉదయమే సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు , నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు చేరుకున్నారు కాసేపటి క్రితం అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, తంగిరాల సౌమ్య తదితరులు కూడా చేరుకున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేస్తోంది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య ముహూర్తం బాగుందని పండితులు చెప్పడంతో.. రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా దీనిని విడుదల చేస్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa