ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కారణంతోనే చంద్రబాబు, పవన్ సభకు వెళ్లలేకపోయా.. అయినా సంతోషమే: నాగబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 08:04 PM

తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన 'తెలుగు జన విజయకేతనం' సభకి కమ్యునికేషన్ కారణాల దృష్ట్యా తాను సకాలంలో స్టేజ్ పైకి చేరుకోలేకపోయానన్నారు. అప్పటికే ఆ సభా ప్రాంగణం అంతా జనసైనికులతో తెలుగు దేశం శ్రేణులుతో నిండిపోవడంతో తన కారు ముందుకెళ్లలేకపోయింది అన్నారు. అందుకే తాను వెళ్లలేకపోయానన్నారు. ఇంతటి దిగ్విజయ సభలో తాను పాల్గొనలేనందుకు ఒకింత బాధగా ఉన్నా.. తాను కనీసం అటు పోలేనంత జన సందోహంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయేంత విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.


ఇలాంటి భారీ బహిరంగ సభని ఎటువంటి ఆటంకాలకి తావులేకుండా దిగ్విజయంగా జరగడం లో ముఖ్య పాత్ర పోషించిన జనసేన పార్టీ నేత కేఎస్‌ఎస్‌ఆర్ అండ్ టీమ్‌‌‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సభని ఇంత అంగరంగ వైభవంగా జనసందోహంగా మార్చిన జనసైనికులకి, వీరమహిళలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి శుభానినందనలు తెలిపారు నాగబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. పీఏసీ సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే పవన్, చంద్రబాబు పాల్గొన్న సభకు తాను వెళ్లలేకపోవడంపై నాగబాబు స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa