ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా 2024 ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అధ్యక్షతన జరిగిన పాతపట్నం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రివర్యులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాసు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, మాజీ రాజ్యసభ సభ్యులు పాలవలస రాజశేఖర్, శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జ్ పేరాడ తిలక్, పాతపట్నం నియోజకవర్గ పరిశీలికలు కరిమి రాజేశ్వరరావు పాల్గొని పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa