కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని సినీనటి సమంత దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత శ్రీవారిని దర్శించుకున్నారు. తన సన్నిహితుడు, సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్తో కలిసి సమంత శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల సమంతను చూడటానికి, ఆమెతో ఫోటోలు దిగడానికి భక్తుల ఉత్సాహం చూపించారు.సమంతతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యశ్రీ, మరో యాక్టర్ నాగ మహేష్ వంటి ప్రముఖులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.
అంతకుముందు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సమంత దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అయితే దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చిన సమంతతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమంత మంచి మనసును అభినందిస్తున్నారు. సమంతతో ఫోటో దిగేందుకు ఓ దివ్యాంగుడు అక్కడే నిరీక్షిస్తూ ఉన్నారు. సమంత ఆలయం బయటకు రాగానే ఆమెతో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న సమంత ఆగిమరీ.. ఆయనతో ఫోటో దిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . సమంత చేసిన పనిని నెటిజనం ప్రశంసిస్తున్నారు .
మరోవైపు మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత కొన్ని రోజులు సినిమాలకు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఈ బ్యూటీ.. తమిళ హీరో విజయ్ ఆఖరి చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa