కృష్ణా జిల్లా పెనమలూరు సమీపంలోని యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభానికి ఏర్పాటు చేయనున్న స్వర్ణతాపడం పనులకు శ్రీకారం చుట్టారు. స్వామి భక్తులు, గ్రామానికి చెందిన దాత సంగా నరసింహారావు ఇచ్చిన రూ.1.70 కోట్ల విరాళంతో ఈ పనులు నిర్వహిస్తున్నారు. రాగి రేకుకు బంగారు పూతతో తాపడాలను ధ్వజస్తంభానికి అతికించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి గంగాధర్ తెలిపారు. ఈ పనులను చెన్నైలో స్మార్ట్ క్రియేషన్ సంస్థ నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఆలయ ధ్వజస్తంభ పీఠం, మాలికలు, మేఖలాలు, త్రిశూలంతో పాటు మొత్తం 96 స్వర్ణపూత విడి భాగాలను ధ్వజస్తంభానికి అలంకరిస్తున్నట్లు వెల్లడించారు. వీటిని చెన్నై నుంచి ప్రత్యేక కంటైనర్లో ఆలయానికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఉదయం వేదమంత్రాలు, మేళతాళాలతో భక్తులు, గ్రామస్థులు వెంట రాగా.. దాత సంగా నరసింహారావు దంపతులు స్వర్ణపూత విడి భాగాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకు వెళ్లారు. బుధవారం ఈ పనులు పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. దాత సంగా నరసింహారావు ఇచ్చిన రూ.1.70 కోట్లతోనే ఈ పనులు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa