ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి.. వీఆర్వో రమేష్ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభియోగాలు, ఆధారాలు పరిశీలించి రమేష్ను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ప్రోసీడింగ్స్ జారీచేశారు. రమేష్పై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యేవరకూ హెడ్ క్వార్టర్ను వదిలి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు.
మరోవైపు ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో ముఖేష్ ముమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని హెచ్చరించారు.
అంతేకాదు రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాలు, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హార్డింగులను తక్షణమే తొలగించాలని సూచించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్కు సీఈవో ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్ప నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలల్లో బహిరంగ స్థలానూ 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చూడాలన్నారు. సీ-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని సీఈవో మీనా ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి విధిగా అమలయ్యేలా ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులకు సంబంధించిన నివేదికలు తనకు అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇచ్చే ప్రతిపాదనలు హోంశాఖకు పంపాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa