ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ కోసం ప్రాణాలే రిస్క్.. విలేకర్ల సమావేశంలోనే పురుగులమందు తాగిన టీడీపీ లీడర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 07:47 PM

టీడీపీకి అసంతృప్తుల సెగ తగులుతూనే ఉంది. టికెట్ రాని నేతలు తమ అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వెళ్లగక్కుతున్నారు. కొంత మంది అధినేత ఇంటివద్ద హడావిడి చేస్తుండగా.. మరికొంత మంది పక్క పార్టీనేతలతో టచ్‌లోకి వెళ్తున్నారు. అయితే పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాత్రం తమ అసంతృప్తిని మరో రూపంలో వెళ్లగక్కారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విలేకర్ల సమావేశంలోనే ఏకంగా పురుగుల మందు తాగారు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో చుట్టుపక్కల నేతలంతా షాక్ తిన్నారు. వెంటనే అతన్ని కార్లో ఆస్పత్రికి తరలించారు.


అసలు సంగతిలోకి వస్తే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలో కూటమి నేతలలో ఇంకా క్లారిటీ రాలేదు. వైసీపీ తరుఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఈ టికెట్ ఎవరికి వెళ్తుందనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేట అసెంబ్లీ టికెట్‌ను చదలవాడ అరవిందబాబుకు కేటాయించాలంటూ నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ పులిమి రామిరెడ్డి బుధవారం తన ఇంట్లోనే విలేకర్ల సమావేశం నిర్వహించారు. పోల్ మేనేజ్ మెంట్ చేయలేడని అరవింద బాబును పక్కనపెట్టే ఆలోచన చేస్తున్నారన్న రామిరెడ్డి.. అరవింద బాబుకు టికెట్ ఇవ్వకపోవటం కరెక్ట్ కాదన్నారు. గత ఎన్నికల సమయంలో ఓడిపోయిన నాటి నుంచి కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారని అన్నారు.


ఈ క్రమంలోనే చదలవాడకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ పులిమి రామిరెడ్డి పురుగులమందు తాగేశారు. చదలవాడ అరవింద బాబుకు టికెట్ రాకపోతే అందుకు లావు శ్రీకృష్ణదేవరాయలదే బాధ్యత అని విమర్శి్ంచారు. అయితే ఉన్నట్లుండి జరిగిన ఈ ఘటనతో కార్యకర్తలు, కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. వెంటనే కార్లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa