తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మార్చి 24, 25వ తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అలాగే ఉత్సవం సందర్భంగా పలు జాగ్రత్తలు సూచిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఉత్సవంలో భాగంగా తుంబురు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం అంటే ఆదివారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే మార్చి 25వ తేదీన ఉదయం అనగా సోమవారం ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. అలాగే తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండె, శ్వాసకోస సమస్యలు, స్థూలకాయం ఉన్న వారికి అనుమతి లేదని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. అలాగే తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవానికి వచ్చే భక్తులు తమవెంట వంటసామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవానికి వచ్చే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడా భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈరోజు తీర్థంలో స్నానం చేసి, దానధర్మాలు చేసి స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే తుంబురతీర్థ ముక్కోటి ఉత్సవం రోజున పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa