జనసేన అధినేత పవన్కల్యాణ్ తాను పోటీ చేస్తున్న కాకినాడజిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారా వం పూరించనున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజులపా టు ఇక్కడే ఉండి పలు సమావేశాల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను ఇక్కడే జరుపుకుంటారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్కల్యాణ్ సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 30వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వెళ్లతానని, అందుకు అనుగుణంగా ప్రచారం షెడ్యూల్స్ ఉండాలని సూచించారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీచేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్స్ ఉండాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa