ఈ ఏడాది మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటన్నారో నిర్ణయించుకొని ప్రతి ఒక్క రూ నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని బొబ్బిలి ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి సాయిశ్రీ పిలుపునిచ్చారు. స్థానిక రాజాకళాశాల మైదానం నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు శుక్రవారం స్వీప్ 2కె వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ఏవీ లేకుండా ప్రతిఒక్కరూ ఓటు వేయాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చే యవచ్చన్నారు. వచ్చే నెల 15 వరకు కొత్తగా ఓటర్ల పేర్లు నమోదు చేసుకోవాల న్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా , విజయ వంతంగా జరిపేందుకు జిల్లా ఎస్పీ, స్థానిక ఆర్వో ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రోటరీక్లబ్ అధ్యక్షుడు జేసీ రాజు ఆధ్వర్యంలో ప్లకార్డులు ప ట్టుకొని నినాదాలు చేసుకుంటూ వాక్థాన్ నిర్వహించారు. తహసీల్దారు త్రినా థరావునాయుడు, మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి, ఎంపీడీవో రవికు మార్, సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు, డీటీ రెడ్డి సాయికృష్ణ, సీహెచ్జే ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa