ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప ఎంపీగా షర్మిలను గెలిపించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 03:23 PM

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు ..అధర్మం మరోవైపు ఉన్నాయని, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు,అధికారం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa