బోండా ఉమామహేశ్వర రావుకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడని తెలిపారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లంపల్లి.. రామకృష్ణపురం 30వ డివిజన్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి. బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్కు ఎవరు వచ్చిన దిక్కులేదు. నిన్న రాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. బోండా ఉమను అరెస్ట్ చేస్తారని.. అతనికి అతనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశాడు. బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుంది. సీఎం వైయస్ జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా. బోండా ఉమా వెనకాల ప్రజలు లేరు. సీఎం జగన్ బోండా ఉమ అనుచరుల దాడిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బోండా ఉమా హత్య ప్రయత్నం చేయిస్తాడా?. వేముల దుర్గారావు సొంత మనిషి అని బోండా ఉమనే చెప్పాడు. ఇక.. సీఎం వైయస్ జగన్పై రాయి వేశారని.. బోండా ఉమానే ఒప్పుకున్నాడు. ఇంతకన్నా ఆధారాలు ఏమి కావాలి. బోండా ఉమకు డిపాజిట్లు కూడా రావు ఛాలెంజ్. మే 13న జరిగే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ విజయ ప్రభంజనం ఖాయం.ఏప్రిల్ 22న ఉదయం విజయవాడ సెంట్రల్ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తా. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ దగ్గర నుండి నగరపాలక సంస్థ నుండి ర్యాలీ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాల్గొని నామినేషన్ ర్యాలీని జయప్రదం చేయాలి. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని వెల్లంపల్లి అన్నారు.
![]() |
![]() |