సీఎం వైయస్ జగన్ గారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని వైయస్సార్ సిపి మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత కాలవశ్రీనివాసులును హెచ్చరించారు.రాయదుర్గం సభలో చంద్రబాబు మెప్పు పొందేందుకు కాలవ శ్రీనివాసులు జగన్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మాట్లాడుతూ కాలవ శ్రీనివాసులు జగన్ గారిని నయవంచకులంటూ తూలనాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.నిజానికి రాష్ర్ట ప్రజలను నిత్యం మోసం చేసే చంద్రబాబు, లోకేష్ లే నయవంచకులని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు పయనింపచేసింది చంద్రబాబు అని అన్నారు. అమరావతి రాజధాని పేరుతో వేలకోట్ల రూపాయలు దోచుకుంది చంద్రబాబు కాబట్టే ప్రజలు 2019లో 23 స్దానాలకే టిడిపిని పరిమితం చేశారన్నారు. రానున్న ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం కావడంతో దిక్కుతోచని స్దితిలో చంద్రబాబు, కాల్వశ్రీనివాసులు లాంటి వాళ్లు అభూతకల్పనలు ప్రచారం చేస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa