ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటిన టీడీపీ లీడర్ కుమార్తె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:23 PM

ఏపీలో సోమవారం పదోతరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రతి వందమందిలో సుమారు 85 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. కొంతమంది విద్యార్థినీ, విద్యార్థులు మార్కుల పంట పండించారు. ఇక ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి పదోతరగతి పరీక్షా ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. అయితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఓ టీడీపీ లీడర్ కుమార్తె సైతం సత్తాచాటింది. 584 మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటోంది.


తిరుపతి జిల్లా కోడూరుకు చెందిన పంతగాని నరసింహ ప్రసాద్.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పంతగాని నరసింహ ప్రసాద్ కొనసాగుతున్నారు. వివిధ అంశాల మీద, ప్రజా సమస్యల మీద తనదైన నిరసనలతో పంతగాని వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆయన కుమార్తె సాయి శ్రావ్య వార్తల్లో నిలిచింది. సోమవారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సాయి శ్రావ్య 584 మార్కులు సాధించింది. స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న సాయి శ్రావ్య.. 584 మార్కులతో రాణించింది.ఈ నేపథ్యంలో సాయి శ్రావ్యను అభినందిస్తూ పలువురు పంతగాని మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు అభినందించారు.


మరోవైపు సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఈసారి 86.69 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తే.. అందులో 86.69 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇక ఉత్తీర్ణులు అయిన వారిలోనూ బాలికలదే హవా. బాలికలు వందకు 89 మంది పాస్ అయితే.. బాలురు వందకు 84 మంది ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa