ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని తెలుగు దేశం పార్టీలో చేరారు. నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన ముందుచూపు ఏపీ అభివృద్ధికి అవసరమని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ఆశయాలు నచ్చే తాను టీడీపీలో చేరానని.. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి 2019 ఎన్నిలకు ముందు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోసాని సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa