ఏపీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెద్ద చర్చ నడుస్తోంది. ఇదో సంస్కరణ అని, భూములపై సర్వహక్కులు కల్పించేందుకే ఈ చట్టం తెస్తున్నామని వైసీపీ చెబుతోంది. అయితే భూములు, ఆస్తులు కాజేసేందుకే ఈ చట్టం తెచ్చారంటూ కూటమి ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి స్పందించారు. విపక్షాల ప్రచారంపై మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పోసాని కృష్ణమురళి ప్రజలను కోరారు. వంశపారంపర్యంగా రైతులకు వచ్చే భూములు వారివి కాకుండా పోతాయా అని ప్రశ్నించారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ చట్టం ద్వారా పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. పేదల భూములు కాజేసే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు ఒరిజినల్ కాకుండా జిరాక్స్ పత్రాలు అందిస్తారని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి భూములు లాక్కునేందుకు తెచ్చింది కాదని.. భూములపై సర్వహక్కులు కల్పించేందుకు తీసుకువచ్చిన చట్టమని చెప్పుకొచ్చారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదంటూ ప్రతీ సభలో చెప్తూ వస్తున్నారు. జిరాక్స్ పత్రాలు ఇస్తారన్న విమర్శలకు సైతం కౌంటరిస్తున్న వైఎస్ జగన్... మంగళగిరిలో పవన్ కళ్యాణ్, విశాఖపట్నంలో బాలకృష్ణ భూములు కొన్నారని.. వారికి ఏమైనా జిరాక్స్ పేపర్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోసాని సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ర్పచారం చేస్తున్నారని.. దీని ద్వారా భూములు లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa