కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటించారు. ముందుగా రాహుల్ హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకున్నారు.. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు.. రాహుల్ వెంట ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ ఉన్నారు. వైఎస్సార్ ఘాట్కు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. కొద్దిసేపు ఘాట్ దగ్గర కూర్చున్నారు.
ఇడుపులపాయ నుంచి బయల్దేిరి వెళ్లి కడపలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కడప లోక్సపభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆమె తరఫున రాహుల్ గాంధీ కడపలో ఎన్నికల ప్రచారం చేశారు. బహిరంగసభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికే కాదు దేశానికి వైఎస్సార్ ఆదర్శమన్నారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్సార్ తనతో చెప్పారన్నారు. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం.. కాంగ్రెస్ సిద్థాంతమన్నారు. సామాజిక న్యాయ కోసం, పేదల కోసం వైఎస్సార్ రాజకీయం చేశారన్నారు. కానీ ఏపీలో ఇప్పుడు ఆ రాజకీయం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ను బీజేపీ బీ టీమ్ నడిపిస్తోందని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ విమర్శించారు రాహుల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారని.. ఆయన కుమారుడు జగన్ మాత్రం బీజేపీని ప్రశ్నించరన్నారు. ఎందుకంటే జగన్పై అవినీత కేసులు ఉన్నాయి కాబట్టే ఏం మాట్లాడటం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని.. కేంద్రాన్ని జగన్ ఎందుకు నిలదీయలేదని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామన్నారు రాహుల్ గాంధీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa