ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి నేతలు ఎవరిపై ఫిర్యాదు చేస్తే ఆ అధికారిని బదిలీ చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 12:04 AM

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు, ఎల్లోమీడియాపై అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించ‌డం లేద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..... భువనేశ్వరి మూడు లక్షల చొప్పున నగదు పంపిణీ చేస్తుంటే ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఎల్లోమీడియా తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేసినా ఈసీ సరైనరీతిలో స్పందించలేదు. పవన్ కళ్యాణ్, లోకేష్ లు జగన్ గారిని చంపండి, రాళ్లతో కొట్టండంటూ క్రిమినల్ నేచర్ తో మాట్లాడిన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీన్నిబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయనే నమ్మకం లేకుండా పోయింది. కూటమి నేతలు ఎవరిపై ఫిర్యాదు చేస్తే ఆ అధికారిని బదిలీ చేశారు. అధికారులలో ఆత్మస్ధైర్యం కోల్పోయాలా ఆదేశాలు వచ్చాయి.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్న అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేశాం.ల్యాండ్ టైట్లింగ్ యాక్టు కాపీలను కాల్చిన వారిపై కేసులు పెట్టాలని ఈసీని కోరాం. కూటమి నేతలు వివిధ ఎంసిసి ఉల్లంఘనలపై ఇప్పటికి 300 ఫిర్యాదులు చేసినా ఈసీలో స్పందన లేదు. మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి పెద్దలు ఏపీకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు గురించి కూటమి నేతలు చర్చించలేదు. రాష్ర్ట ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి హామీలూ తీసుకోలేదు.2014లో న్యాయవాదులకు చంద్రబాబు 18 హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వైయస్ జగన్ 2019లో ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేసి చూపించారు. జూనియర్‌ న్యాయవాదులకు లా నేస్తం పేరుతో నిధులు ఇచ్చారు.వంద కోట్ల రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేసి న్యాయవాదులకు అండగా నిలిచామ‌ని మ‌నోహ‌ర్‌రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa