సరిహద్దుల్లో పాకిస్థాన్తో పాటు చైనా నుంచి కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను కశ్మీర్లోకి పాకిస్థాన్ ఎగదోస్తుంటే.. చైనా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా, పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో కలకలం రేగింది. అమృత్సర్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో చైనా డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శనివారం రాత్రి స్వాధీనం చేసుకుంది. అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. 520 గ్రాముల హెరాయిన్ ప్యాకెట్లను చుట్టి అందులో ఉంచిట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
‘అమృత్సర్లోని హర్డో రత్తన్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చైనా డ్రోన్ని గుర్తించాం.. మే 11న తరన్ తరన్ జిల్లా సరిహద్దుల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్కు సంబంధించి BSF ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించింది.. పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఆ ప్రాంతంలో శనివారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. తనిఖీలు నిర్వహిస్తుండగా చైనా డ్రోన్ కంటపడింది.. దానిని పరిశీలించగా అందులో హెరాయిన్ ప్యాకెట్లు కనిపించాయి" అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
ఆ ప్యాకెట్లకు మెటల్ రింగ్తో పాటు వాటికి గుర్తించేలా మెరిసే స్టిక్స్ను వేలాడదీసినట్టు చెప్పారు. డ్రోన్ని చైనా తయారైన డీజేఐ మావిక్ 3 క్లాసిక్గా గుర్తించారు. అనంతరం శనివారం రాత్రి 7.30 గంటలకు ముందు తరన్ తరన్ జిల్లాల్లోని శంకతారా గ్రామంలో పొలాల్లో 2.17 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటిని కూడా డ్రోన్ల సాయంతోనే జారవిడిచినట్టు గుర్తించామని పేర్కొన్నారు. మరో ప్రాంతంలో 7.45 గంటలకు 569 గ్రాముల హెరాయిన్ పట్టుబడినట్టు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa