ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 08:59 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ వేళ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో ఓ ఓటర్ ఆందోళనకు దిగారు. తనతో బలవంతంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయించారని ఆవేదన వ్యక్తం చేశఆడు. తన ఓటు తనకు కావాలని.. తాను మళ్లీ ఓటేస్తానని పట్టుబట్టి కూర్చున్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు మోకాళ్ల చిప్పలు అరిగిపోవడంతో నడవలేకపోతున్నారు. ఆటోలో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన నాగేశ్వరరావు.. డ్యూటీలో ఉన్న సిబ్బంది సాయంతో పోలింగ్ కేంద్ర లోపలికి వెళ్లారు.


లోక్ సభ స్థానానికి తానే స్వయంగా ఓటు వేసుకున్నారట. అయితే, అసెంబ్లీ స్థానానికి ఓటు వేసేటప్పుడు అక్కడున్న ఎన్నికల అధికారి సాయం కోరారట. అయితే, తాను గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెబుతుంటే.. ఆ అధికారి తన చేయి పట్టుకుని బలవంతంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించారని నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. తన ఓటు తనకు కావాల్సిందేనని పట్టుబట్టాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు, సిబ్బందికి అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa