ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 09:15 PM

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవమిచ్చారు. ఇదిలావుంటే జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన వారణాసి పయనమయ్యారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్డీయే భాగస్వామి పవన్ కల్యాణ్ కు కూడా ఆహ్వానం అందింది. మోదీ ఆహ్వానం నేపథ్యంలో, పవన్ కల్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వారణాసి చేరుకున్నారు. 


ఎయిర్ పోర్టులో ఆయనను జాతీయ మీడియా పలకరించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని అన్నారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమకు మంచి మెజారిటీ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.  ఇక, ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి తన మద్దతు అందించి, శుభకాంక్షలు తెలుపుతానని, ఆయన మూడోసారి ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. వారణాసి వచ్చిన సందర్భంగా పవన్ మెడలో కాషాయ కండువాతో కనిపించారు.  కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వారణాసిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa