ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలుచోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పల్నాడు జిల్లా, తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ హైటెన్షన్ నెలకొంది. ఎన్నికలు పూర్తై రెండురోజులు గడుస్తున్నప్పటికీ వైసీపీ, టీడీపీ వర్గాల పరస్పర దాడులతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు పోలింగ్ ముగిసిన తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీటిని నివారించడంలో జరిగిన వైఫల్యంపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీచేసింది. ఘటనలను ఎందుకు అరికట్టలేకపోయారో వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ముందు వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. గురువారం నాటి భేటిలో భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరనున్నట్లు తెలిసింది.
తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన దాడిలో గాయపడిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నానిపై.. వైసీపీ వర్గాలు దాడి చేశాయి. సమ్మెట, కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడిచేశారు. ఈ ఘటనలో పులివర్తి నాని భుజానికి గాయాలయ్యాయి. గన్మెన్ తలకు గాయమైంది. దాడి తర్వాత స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన పులివర్తి నాని.. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa