పల్నాడు బస్సు దుర్ఘటనను మరిచిపోకముందే ఏపీలో మరో ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘాట్ రోడ్డులో లారీ బ్రేక్ ఫెయిల్ కావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెనుకవస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావటంతో.. వేగంగా వచ్చి ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ వేగానికి రెండు లారీలు కాస్తా ఆ ముందు వెళ్తున్న బైక్, ట్రాక్టర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆస్పత్రికి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. లారీ కింద పడి బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ పలమనేరు నుంచి వరిగడ్డితో చిత్తూరుకు వెళ్తున్నట్లు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు మంగళవారం రాత్రి పల్నాడు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా సొంత ఊరిలో ఓటు వేసి.. హైదరాబాద్కు బస్సులో తిరుగు ప్రయాణం కాగా.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు దగ్గర.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో టిప్పర్ ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగగా.. మొత్తం ఆరుగురు సజీవ దహనం అయ్యారు. 20 మందికి గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa