ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 02:03 PM

పలాస, పెదంచల గ్రామానికి చెందిన వరిశ జానారావు రోడ్డు ప్రమాదానికి గురై గురువారం మృతి చెందాడు. జానారావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. స్థానిక టీడీపీ నాయకుల కథనం మేరకు.. జానారావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోలింగ్‌ ఏజెంట్‌గా వ్యవహరించాడు. ఎన్నికల తర్వాత రోజు మంగళవారం ఆయన తన వ్యక్తిగత పని మీద విశాఖపట్నం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గంగువాడ-ఈదురాపల్లి గ్రామాల మధ్య రోడ్డు మీద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం స్థానికులు గుర్తించి జానారావును కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించగా గురువారం మృతిచెందాడు. కాగా ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటిలోనే రోడ్డు ప్రమాదానికి గురికావడంపై పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. జానారావు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌గా పని చేయడమే కారణమా లేదా బైకు ప్రమాదానికి గురై అపస్మారక స్థితికి చేరాడా, ఇతరులెవరైనా దాడికి పాల్పడ్డారా అన్న విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. జానారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఈ విషయంపై కాశీబుగ్గ పోలీసులకు ఆంరఽధజ్యోతి వివరణ కోరగా తమకు పూర్తిస్థాయి సమాచారం రాలేదని, సమాచారం వస్తే దర్యాప్తు చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa