ఓ మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.. అనుమానంతో స్కాన్ చేయగా.. రిపోర్ట్ చూసి అవాక్కయ్యారు.. ఆమెకు అత్యవసరంగా సర్జరీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన నరసవేణి అనే మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా.. స్థానికంగా దొరికే పెయిన్ కిల్లర్స్ వాడటంతో తాత్కాలికంగా నొప్పి తగ్గేది. ఆమెకు కొంతకాలంగా భరించలేనంతగా నొప్పి రావంతో వెంటనే అమలాపుంరలోని ASA ఆస్పత్రికి వెళ్లారు.
అక్కడ డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.. ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. ఆమెకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది.. ఆమె కడుపులో నుంచి ఏకంగా 570 రాళ్లను బయటకు తీసిన డాక్టర్లు అవాక్కయ్యారు. కడుపులో ఇన్ని రాళ్లు ఉండటంతో చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. సాధారణంగా కడుపులో పదుల సంఖ్యలో రాళ్లు ఉండటాన్ని చూశామని.. ఇలా వందల సంఖ్యలో ఉండటంతో డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు మహిళకు సమయానికి సర్జరీ చేశామని.. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa