లోక్సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న కేజ్రీవాల్కు చికిత్స కోసం సర్వోన్నత న్యాయస్థానం.. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని సూచించింది. దీంతో మరో నాలుగు రోజుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో ఆప్ అధినేత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.
ముఖ్యమంత్రికి ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, ఇంకొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ల బృందం తెలిపింది. ఆయన ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ తరపు లాయర్ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయ్యారు.
తన అరెస్ట్ అక్రమమని, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణలో జాప్యం జరుగుతుండటంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం మే 10న ఆయనకు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, సుప్రీం నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్కు ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చారని విమర్శించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇందులో ఎటువంటి మిహాయింపులు లేవని తేల్చిచెప్పింది. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే హక్కు ఆయనకు ఉందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa