కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామంలోని ప్రధాన రహదారిలో చోరీ జరిగింది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవి ఏడాది క్రితం వల్లం పాడు గ్రామానికి వచ్చి ప్రధాన రహదారిలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగి స్తోంది. అయితే రోజులాగే మంగళవారం రాత్రి కూడా హోటల్ నిర్వహణ పూర్తి చేసుకొని తాళం వేసి ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం వచ్చి చూడగా హోటల్ గది తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించానని హోటల్ యజ మాని మాధవి వెల్లడించింది. హోటల్ గదిలో వున్న 12 ప్యాకెట్ల బియ్యం, మూడు గ్యాస్ సిలిండర్లు, రూ.5వేల నగదు అపహరణకు గురైనట్లు ఆమె వాపోయింది. రేవనూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa