ఉమ్మడి ఏపీ నుంచి 2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఎందరో ఉద్యమకారుల పోరాటాలు, ఆత్మబలిదానాల కారణంగా కారణంగా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ స్పెషల్ స్టేట్గా ఆవిర్భవించి నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం తరపున ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇక నేటితో హైదరాబాద్ నగరానికి ఏపీకి ఉన్న బంధం అధికారికంగా తెగిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 సంవత్సరాలు ప్రకటించింది. దాంతో పాటు రాజధానిలోని ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాలకు సమానంగా పంచారు. కానీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును వదులుకొని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడి నుంచి పాలన సాగించారు. 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం.. హైదరాబాద్ను వాడుకోకుండా మూడు రాజధానుల పేరుతో పాలన సాగించింది.
అయితే కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నేటితో 10 సంవత్సరాలు పూర్తయింది. దీంతో హైదరాబాద్ నగరంతో ఏపీకి ఉన్న బంధం అధికారికంగా తెగిపోయింది. నేటి నుంచి హైదరాబాద్ నగరం పూర్తిగా తెలంగాణకే సొంతం కానుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన ఆస్తులన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. కాగా, ఇప్పటికీ కొన్ని విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి సమస్యలు ఉన్నాయి. వీటికి కూడా పరిష్కారం దొరికితే.. ఏపీతో పూర్తిగా సంబంధాలు తెగిపోనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa