వైసీపీ అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 2,45,489 మంది ఓటర్లు ఉండగా, 1,74,588 ఓట్లు పోలయ్యాయి. మత్స్యలింగంకు 64,848 ఓట్లు రాగా, పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. రేగం మత్స్యలింగం ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు అరకు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ప్రకటించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమక్షంలో ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa