శ్రీవారి దర్శనానికి సంతోషంగా బయలుదేరారు. మరికొన్ని గంటల్లో తిరుమలకు చేరుకుంటామనగా రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని మృత్యువు కాటేసింది. ఈ ఘటన పూతలపట్టు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పూతలపట్టు సీఐ సుదర్శన్ వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం కల్లకుర్చి గ్రామానికి చెందిన బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం 7 గంటలకు బెంగళూరు - తిరుపతి సిక్స్ లేన్ రోడ్డులో కిచ్చెన్నగారిపల్లె గ్రామానికి ఎదురుగా అదుపుతప్పి కారు డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ విఘ్నేష్ అలియాస్ విక్కీ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాలాజీ, షణ్ముగప్రియ, పవన్లను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. షణ్ముగప్రియ (30) చికిత్స పొందుతూ మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన బాలాజీ, పవన్లను మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. పూతలపట్టు సీఐ సుదర్శన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa