చేనేత పరిశ్రమను కొత్తప్రభుత్వమైన కాపాడాలని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జింకాచలపతి కోరారు. ధర్మవరం పట్టణంలోని చేనేత సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. దర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యకుమార్ యాదవ్కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మవరం అంటే చేనేత పరిశ్రమకు పేరుగాంచిందన్నారు. ఈ పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి కల్గిస్తోందన్నారు. అయితే ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. దీనికి కొంతమంది స్వార్థపరులు వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి పవర్లూమ్స్మగ్గాలను చట్ట వ్యతిరేకంగా ఇక్కడికి తీసుకురావడమే కారణమన్నారు. దీనివల్ల చేనేత కార్మికుల ఉపాధిపై దెబ్బ పడిందన్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి విచ్చలవిడిగా ధర్మవరంలో పవర్లూమ్స్ మగ్గాలను నడిపిస్తున్నారన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యేకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అండగా నిలబడ్డారని ఆరోపించారు. కావున కొత్త ప్రభుత్వ మైనా చేనేత పరిశ్రమను కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ,జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, గౌరవాధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్, నరసింహులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa