ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలు ఎక్కడికి పోతాయన్నారు. ఈ జగన్ తమకొద్దని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఓడించారని అన్నారు. వర్లరామయ్య టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...... ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయినా.. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా పరనింద చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణమన్నారు. వైసీపీకి ఎస్సీలు బానిసలు కాదని.. నిరంకుశ, నియంతృత్వ, ప్రజా వ్యతిరేక పాలనను ఎస్సీలు ఛీ కొట్టారని అన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వైసీపీ ప్రభుత్వం చంపింది.. తమ దళిత బిడ్డలు ఇంకా మరిచిపోలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa